AI University | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: దేశంలో తొలి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యూనివర్సిటీ మహారాష్ట్రలో ఏర్పాటు కాబోతున్నది. ఈ ప్రాజెక్టు అమలు కోసం వివిధ రంగాల నిపుణులతో ఓ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటైనట్టు ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ఆశిష్ షేలర్ వెల్లడించారు. మహారాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో ఐఐటీ ముంబై, ఐఐఎం ముంబై డైరెక్టర్లు, గూగుల్ ఇండియా, మహీంద్రా గ్రూప్, ఎల్అండ్టీ లాంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులు, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులు, రాజీవ్ గాంధీ సైన్స్ అండ్ టెక్నాలజీ కమిషన్, డాటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిపుణులు సభ్యులుగా ఉన్నట్టు తెలిపారు. ఇప్పటికే రెండుసార్లు సమావేశమైన ఈ కమిటీ.. ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కోసం తుది రోడ్మ్యాప్ను రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నట్టు వివరించారు.