రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని తల్మేంద్రి అడవుల్లో తుపాకుల మోత మోగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టుల క్యాంపును పోలీసులు కూల్చేశారు. పోలీసులు వస్తున్నారన్న సమాచారం అందడంతో మావోయిస్టులు అక్కడ్నుంచి పరారీ అయ్యారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఘటనాస్థలి నుంచి మావోయిస్టు సాహిత్యం, సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం బలగాల కూంబింగ్ కొనసాగుతూనే ఉంది.