నోయిడా: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలోని షాహ్బెరి ఏరియాలోగల ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.
స్థానికులతో కలిసి 12 ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. భవనంలోపల చిక్కుకున్న 24 మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఎవరికీ ఎలాంటి గాయాలు కూడా కాలేదు. ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉంది.