దౌరాలా: రైలు ఇంజిన్లో మంటలు చెలరేగడంతో.. ప్రయాణికులు ఆ రైలును నెట్టుకుంటూ వెళ్లారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. మీరట్ సమీపంలో ఉన్న దౌరాలా రైల్వే స్టేషన్లో షహరాన్పూర్, ఢిల్లీ మధ్య నడిచే రైలులో మంటలు వ్యాపించాయి. ఆ ట్రైన్ ఇంజిన్తో పాటు, దాని పక్కనే ఉన్న రెండు బోగీల్లో మంటలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు అలర్ట్ అయ్యారు. తక్షణమే ట్రైన్ దిగిన జనం అంతా.. ఆ రైలును ఇంజిన్ నుంచి వేరు చేసి వెనక్కి తోశారు. దౌరాలా రైల్వే స్టేషన్లో ఫ్లాట్ఫామ్పై ఆ రైలులో ఉన్న ప్రయాణికులు దాన్ని ఇంజిన్ నుంచి వేరు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇదే.
#WATCH | Uttar Pradesh: Fire broke out in engine & two compartments of a Saharanpur-Delhi train, at Daurala railway station near Meerut.
Passengers push the train in a bid to separate the rest of the compartments from the engine and two compartments on which the fire broke out. pic.twitter.com/Vp2sCcLFsd
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 5, 2022