ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగోల్పురిలోని ఫేజ్-1 ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి కంపెనీ మొత్తానికి వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతంలో పెద్దఎత్తున పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 26 ఫైరింజన్లతో మంటలను అదుపుచేశారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఉన్న తారాపూర్ పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం జరిగింది. ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ పరిశ్రమలో వరుస పేలుళ్లతో భారీగా మంటలు ఎగసిపడుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.