యూపీలోని దౌరాలా రైల్వేస్టేషన్ సమీపంలో సహరాన్పూర్-ఢిల్లీ ఎక్స్ప్రెస్లో శనివారం మంటలు చెలరేగాయి. రెండు కంపార్ట్మెంట్లతో పాటు రైలు ఇంజిన్కు కూడా మంటలు వ్యాప్తించాయి. దీంతో అవి మిగతా బోగీలకు అంటుకోకుండా ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఇలా ఇంజిన్, అంటుకొన్న రెండు కంపార్ట్మెంట్ల నుంచి మిగతా బోగీలను దూరంగా జరిపి సమయస్ఫూర్తి ప్రదర్శించారు.