న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) కూతుళ్లను లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో అసభ్యంగా కామెంట్స్ చేస్తున్న వారిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివల్ అసహ్యకరమైన వ్యాఖ్యలకు సంబంధించిన స్క్రీన్షాట్లను పోస్ట్ చేశారు.
భారత మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లి కుమార్తెలు వేధింపులకు గురిచేస్తున్నారని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి పోలీసుల దృష్టికి తీసుకువచ్చి.. ఎఫ్ఐఆర్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సదరు వ్యక్తులు చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. ఓ ‘2 నుంచి 7 ఏళ్ల అమ్మాయిల గురించి ఇలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేస్తారా? మీరు ఒక ఆటగాడిని ఇష్టపడకపోతే, అతని కుమార్తెను దుర్భాషలాడతారా? ఎఫ్ఐఆర్ నమోదు చేయమని పోలీసులకు నోటీసు జారీ చేశాను’ అంటూ స్వాతి మలివల్ ట్వీట్ చేశారు. ఈ మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సంబంధిత సెక్షన్ కింద సిటీ పోలీస్ స్పెషల్ సెల్ యూనిట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు. ధోని, విరాట్ కుమార్తెలపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, అతి త్వరలో దోషులందరినీ అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపుతారంటూ ట్వీట్ చేశారు.
देश के 2 बड़े खिलाड़ी विराट कोहली और धोनी की बच्चियों की तस्वीरें ट्विटर पर डालकर कुछ एकाउंट्स भद्दी टिप्पणी कर रहे हैं। 2 साल & 7 साल की बच्ची के बारे में ऐसी घटिया बातें? कोई खिलाड़ी नहीं पसंद तो क्या उसकी बच्ची को गाली दोगे? पुलिस को FIR दर्ज करने के लिए नोटिस जारी कर रहे हैं। pic.twitter.com/9ybadS659r
— Swati Maliwal (@SwatiJaiHind) January 11, 2023