శ్రీనగర్ : జమ్మూ-కశ్మీర్లో స్థానిక ఉగ్రవాద నియామకాలు ఈ ఏడాది 80 శాతం తగ్గినట్లు డీజీపీ ఆర్ఆర్ స్వెయిన్ శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. 2023లో 22 మంది స్థానికులు మాత్రమే ఉగ్రవాద సంస్థల్లో చేరారన్నారు. జమ్మూ-కశ్మీరులో 31 మంది స్థానిక ఉగ్రవాదులు క్రియాశీలంగా ఉన్నట్లు తెలిపారు.
వీరిలో 27 మంది కశ్మీర్కు, నలుగురు జమ్మూకు చెందినవారన్నారు. 2022లో 100 మంది స్థానికులు ఉగ్రవాదంలో చేరారన్నారు. 2021 నియామకాలతో పోల్చితే 2022లో 37% తగ్గుదల కనిపించిందన్నారు.