న్యూఢిల్లీ: శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా 50 కోట్ల మంది కోవిడ్ టీకాలను ఇచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్లోని కల్యాన్ అన్న యోజన లబ్ధిదారులతో ఇవాళ ప్రధాని మోదీ వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్లో 5 కోట్ల మందికి, దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందినట్లు ఆయన చెప్పారు. పండుగ సీజన్ వేళ భారతీయ చేతివృత్తుల ఉత్పత్తులను ఖరీదు చేయాలని ఆయన సూచించారు. ఇది ఆ రంగానికి చెందిన ప్రజలను ప్రోత్సహిస్తుందన్నారు.