పాట్నా: ఒక వృద్ధుడు సైకిల్ తొక్కుతూ అదుపుతప్పి రోడ్డుపై పడ్డాడు. ఆయన త్వరగా లేచి సైకిల్ తీయకపోవడంతో మహిళా పోలీసులు లాఠీలతో కొట్టారు. బీహార్లోని కైమూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భభువాకు చెందిన 70 ఏళ్ల నావల్ కిషోర్ పాండే గత 40 ఏళ్లుగా టీచర్గా పని చేస్తున్నాడు. వయసు పైబడినప్పటికీ ప్రైవేట్ స్కూల్లోని పిల్లలకు పాఠాలు చెబుతున్నాడు. ప్రతి రోజూ సైకిల్పై స్కూల్కు వెళ్లి వస్తుంటాడు.
కాగా, పాండే శుక్రవారం స్కూల్ ముగిసిన తర్వాత సైకిల్పై ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. అయితే సైకిల్ జారడంతో అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. వయసు పైబడటంతో త్వరగా పైకి లేవలేకపోయాడు. దీంతో పడిన సైకిల్ వెనుక వాహనాలు ఆగడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొందరు వాహనదారులు గట్టిగా హారన్లు మోగించసాగారు. దీంతో అక్కడకు వచ్చిన ఇద్దరు మహిళా పోలీసులు ఆ వృద్ధుడికి సహాయం చేయకపోగా అతడిపై తమ ప్రతాపం చూపారు. సైకిల్ నుంచి పడిన తర్వాత త్వరగా పైకి లేవనందుకు, పడిన సైకిల్ను రోడ్డు నుంచి పక్కకు తీయనందుకు లాఠీలతో ఆయనను కొట్టారు.
మరోవైపు స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో బీహార్ పోలీస్ ఉన్నతాధికారులు దీనిపై స్పందించారు. ఆ మహిళా పోలీస్ కానిస్టేబుల్స్పై చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే వారిద్దరినీ మూడు నెలల పాటు సస్పెండ్ చేసినట్లు వార్తలొచ్చాయి.
यह दो महिला सिपाही जिस बुजुर्ग का पिटायी कर रही है उनका नाम पांडेय जी है…कैमूर के एक प्राइवेट स्कूल में पिछले कई दशकों से पढ़ाते हैं… इनकी गलती सिर्फ इतनी थी की साईकिल से जा रहे थे गिर गए …उठने में थोड़ी देर हो गयी …@bihar_police इस बाबा ने अगर कोई गलती कर भी दिए होंगे pic.twitter.com/uMuxJYPctN
— Mukesh singh (@Mukesh_Journo) January 21, 2023