Bhadreshkumar | న్యూఢిల్లీ: తొమ్మిదేండ్ల క్రితం భార్యను దారుణంగా హత్య చేసి పరారైన భద్రేశ్కుమార్ చేతన్భాయ్ పటేల్ అనే భారతీయుడిపై అమెరికా ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) భారీ రివార్డు ప్రకటించింది. నిందితుడి అచూకీ తెలిపిన వారికి 2,50,00 డాలర్లు(రూ.2.1 కోట్లు) ఇస్తామని ప్రకటించింది.
భద్రేశ్కుమార్ను ఎఫ్బీఐ టాప్-10 మోస్ట్వాంటెడ్ జాబితాలో చేర్చింది. భద్రేశ్కుమార్ తన భార్య పాలక్ను 2015, ఏప్రిల్లో హత్య చేశాడు. వీరిద్దరూ మేరీలాండ్లోని హనోవర్లోని ఓ మిఠాయిల దుకాణంలో పనిచేసేవారు. హత్య జరిగిన రోజు ఇద్దరూ నైట్షిఫ్ట్లో ఉన్నారు. రాత్రి పొద్దుపోయాక దుకాణం వెనుక గదిలో తన భార్య పాలక్ను భద్రేశ్కుమార్ కత్తితో పలుమార్లు పొడిచి హత్య చేయడం సీసీటీవీలో రికాైర్డెంది.