కన్నూరు: పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న కుమారుడిని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై అతని తండ్రి కాల్పులు జరిపాడు. ఈ ఘటన కేరళ(Kerala)లోని కన్నూరు సమీపంలో ఉన్న వాలపట్టాణం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఆ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. రోషన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు అతని ఇంటికి వెళ్లారు, అయితే అక్కడే ఉన్న అతని తండ్రి బాబు ఓమన్ థామస్ పోలీసులపై కాల్పులు జరిపినట్లు సిటీ పోలీసు కమీషనర్ అజిత్ కుమార్ వెల్లడించారు. అయితే అక్కడ జరిగిన గలాటలో నిందితుడు రోషన్ తప్పించుకున్నాడు. నిందితుడి ఇంటి నుంచి మూడు పిస్తోళ్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తిపై అటాక్ చేసిన కేసులో రోషన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. జిల్లాలోని వేర్వేరు స్టేషన్లలో రోషన్పై అయిదు క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి.