ముంబై: ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమం వేదికపై ఒక వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తాను ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) అధికారి అని అతను చెప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతనితోపాటు అతని బాడీగార్డ్నని చెప్పుకున్న తుపాకీ కలిగివున్న మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. రోహన్ పారేఖ్గా గుర్తించిన వ్యక్తి తాను పీఎంవో అధికారి అని చెప్పుకున్నాడు. మరో వ్యక్తి తాను రోహన్ పారేఖ్ బాడీగార్డునని చెప్పుకున్నాడు.