
Election Comission | ఐదు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తీపి కబురు అందించింది. ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థులు పెట్టే ఖర్చుల పరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధన ప్రకారం పార్లమెంటరీ నియోజకవర్గాల అభ్యర్థులు 2014 వరకూ 70 లక్షలు ఖర్చు పెట్టుకోవచ్చన్న నిబంధన ఉండేది. ఇకపై వీరు 95 లక్షలు ఖర్చు చేసుకోవచ్చు. అదే 54 లక్షలు ఖర్చు చేసే నిబంధన ఉన్న ప్రాంతాల్లో 75 లక్షలను ఖర్చుచేసుకోవచ్చు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల్లో 28 లక్షల ఖర్చు చేయాలన్న నిబంధన ఉన్నవారు తాజా నిబంధనల ప్రకారం 40 లక్షలు ఖర్చు చేసుకోవచ్చు. అదే 20 లక్షలు ఖర్చు చేయాలన్న నిబంధన ఉన్న వారు తాజా నిబంధనల ప్రకారం 28 లక్షలు ఖర్చు చేసుకోవచ్చు. ఇకపై జరిగే ఎన్నికల్లో ఇవే నిబంధనలు వర్తిస్తాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
The Election Commission of India enhances the existing election expenditure limit for candidates in Parliamentary and Assembly constituencies. These limits will be applicable in all upcoming elections. pic.twitter.com/TGbTaJBs7N
— ANI (@ANI) January 6, 2022