Crime News | న్యూఢిల్లీ : బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన చేయొద్దని చెప్పిన ఓ వ్యక్తిపై మాజీ సైనికుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటన ఢిల్లీలోని బురారీ ఏరియాలో బుధవారం రాత్రి 9:45 గంటలకు చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బురారీలోని రాయల్ అపార్ట్మెంట్స్లో నివాసముంటున్న మాజీ సైనికుడు రవీంద్ర(47) బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన చేశారు. అదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న హేమంత్(37) బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన చేయడం సరికాదని రవీంద్రకు సూచించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన మాజీ సైనికుడు.. హేమంత్పై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో హేమంత్ స్నేహితుడు యశ్పాల్(38) కూడా గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని హేమంత్, యశ్పాల్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. కాల్పులు జరిపిన సమయంలో రవీంద్ర మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.