కౌలాలంపూర్ : మలేసియాలో నివసిస్తున్న భారతీయులపై ఆ దేశ మాజీ ప్రధాని మహతీర్ మహమ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మాలే సంస్కృతికి భారతీయులు పూర్తి విధేయత చూపటం లేదని విమర్శించారు. ‘మలేసియాను ఇష్టపడేవారికే ఈ దేశం సొంతం. భారతీయులు మాలే సంస్కృతిలో ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కూడా చాలామంది భారతీయులు తమ ఇండ్లలో మాలే భాష కాకుండా తమిళం, ఇతర భాషలు మాట్లాడుతున్నారు’ అని అన్నారు.