న్యూఢిల్లీ, ఆగస్టు 2: రాజకీయాలకు గుడ్బై చెబుతూ ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించిన కేంద్ర మాజీ మంత్రి, పశ్చిమ బెంగాల్కు చెందిన బాబుల్ సుప్రియో అంతలోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఎంపీగా కొనసాగుతానని, రాజకీయాల్లో మాత్రం క్రియాశీలంగా ఉండనని తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన తర్వాత సుప్రియో తన తాజా నిర్ణయాన్ని వెల్లడించారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో సుప్రియోకు ఉద్వాసన పలికారు. ఈ నేపథ్యంలో రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ఆయన ప్రకటించారు.