న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ట్విట్టర్పై ఆ సంస్థ మాజీ ఉద్యోగులు రూ.8 కోట్ల దావా వేశారు. చట్టపరంగా తమకు రావాల్సిన డబ్బులను చెల్లించాలని ట్విట్టర్ మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్, మరో ఇద్దరు మాజీ ఉద్యోగులు కోరారు.
కంపెనీ నుంచి తమను తొలగించిన తర్వాత తాము చట్టపరమైన చర్యల కోసం కోర్టుకు వెళ్లామని తెలిపారు. కాబట్టి తమకు రూ.8 కోట్లు చెల్లించాలని పిటిషన్లో కోరారు.