ముంబై, ఆగస్టు 17: ఎన్సీపీకి చెందిన ఓ కీలక నాయకుడు త్వరలోనే జైలుకు వెళ్తాడని బీజేపీ నేత మోహిత్ కంబోజ్ భారతీయ చేసిన ట్వీట్ మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నది. ‘ఈ ట్వీట్ను సేవ్ చేసుకోండి.
ఎన్సీపీకి చెందిన బిగ్.. బిగ్ లీడర్.. త్వరలో నవాబ్ మాలిక్, అనిల్ దేశ్ముఖ్ను కలుసుకోనున్నారు’ అని మోహిత్ ట్వీట్ చేశారు. 2019లో మూసేసిన ఇరిగేషన్ స్కామ్ను తిరిగి దర్యాప్తు చేయాలని మరో ట్వీట్లో డిమాండ్ చేశారు.