న్యూఢిల్లీ : వాట్సాప్పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. తాను నిద్రపోతున్నప్పుడు కూడా వాట్సాప్ పనిచేసినట్టు కనిపించిందని, దీనికి ప్రధాన కారణం వాట్సాప్ బ్యాగ్రౌండ్లో మైక్రోఫోన్ను వాడటమేనని ట్విట్టర్లో పనిచేసే ఓ ఇంజినీర్ ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్లను కూడా జత చేశారు.
ఈ ట్వీట్ ప్రస్తుతం వైరలవుతున్నది. స్పందించిన భారత ప్రభుత్వం ఈ ఆరోపణలపై దర్యాప్తు జరుపుతామని చెప్పింది. ఎలన్ మస్క్ మాట్లాడుతూ వాట్సాప్ను నమ్మలేమని చెప్పారు. ఆరోపణలను వాట్సాప్ కొట్టిపారేసింది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్నందు వల్ల మెసేజ్లను ఎవరూ చూడలేరని వెల్లడించింది.