ముంబై: మెర్సిడీజ్- బెంజ్ కంపెనీ తాజాగా EQS 580 4MATIC EV కారును ఇండియాలో లాంచ్ చేసింది. ఈ కార్యక్రమంలో శుక్రవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. మెర్సిడీజ్కంపెనీ ఇండియాలో తమ కార్ల ఉత్పత్తి సంఖ్యను భారీగా పెంచాలని మంత్రి అభిప్రాయపడ్డారు. అలా చేయడం వల్ల కార్ల ధర తగ్గుతుందని, ప్రజలు కూడా ఆ కార్లను కొనేందుకు ముందుకు వస్తారని మంత్రి అన్నారు. పూణెలో ఉన్న చకన్ ఉత్పత్తి కేంద్రంలో మెర్సిడీజ్ ఎలక్ట్రిక్ కారును మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖా మంత్రి గడ్కరీ మాట్లాడుతూ.. ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి మార్కెట్ ఉందన్నారు. మీరు ఉత్పత్తి పెంచితేనే, కారు ధర తగ్గుతుందని, ఇక్కడ మేమంతా మిడిల్క్లాస్ ప్రజలమని, మీ కారును నేను కూడా కొనలేనని మంత్రి గడ్కరీ అన్నారు. కొత్తగా రిలీజైన్ ఎలక్ట్రిక్ కారు ధర 1.55 కోట్లు. దేశంలో సుమారు 15.7 లక్షల రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నట్లు మంత్రి గడ్కరీ వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ 335 శాతం పెరిగినట్లు ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణం జోరుగా సాగుతోందని, దీని వల్ల ఎలక్ట్రిక్ కార్లకు కూడా మంచి మార్కెట్ ఉంటుందన్నారు.