న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra)ను లోక్సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ఇచ్చిన రిపోర్టును ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఎథిక్స్ కమిటీ చైర్మెన్ వినోద్ సోన్కర్ ఆ నివేదికను సభలో ప్రవేశపెట్టారు. దీంతో సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. కేంద్ర సర్కారుపై ప్రశ్నలు వేసేందుకు ఆమె ఓ వ్యాపారవేత్త నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. నిజానికి మహువా మొయిత్రాపై డిసెంబర్ 4వ తేదీనే ఎథిక్స్ కమిటీ రిపోర్టును ప్రవేశపెట్టాలని భావించారు. కానీ ఆలస్యం కావడంతో.. ఇవాళ ఆ నివేదికను ప్రవేశపెట్టారు. ఈ ఘటనపై ఎంపీ మహువా స్పందించారు. వస్త్రాపరహణ మొదలైందని, ఇక ఇప్పుడు మహాభారత్ స్టార్ట్ అవుతుందని మహువా అన్నారు.
#WATCH | TMC MP Mahua Moitra leaves from Parliament after the Ethics Committee report on her was tabled in Lok Sabha.
She says, “We haven’t received it yet. Let me have my lunch and come back. Whatever has to happen, will happen after 2 pm…” pic.twitter.com/wACqT92PGr
— ANI (@ANI) December 8, 2023