హైదరాబాద్: తమిళనాడులోని కూనురు వద్ద జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ చీఫ్ జనరల్ రావత్తో పాటు మొత్తం 14 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనపై కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ చాలా నిష్పక్షపాతంగా జరుగుతున్నట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీ తెలిపారు. హైదరాబాద్లోని దుండిగల్ వైమానిక దళ అకాడమీలో ఇవాళ జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. సీడీఎస్ రావత్ దంపతులు, మరో 12 మంది రక్షణదళ సిబ్బంది మృతి పట్ల ఆయన నివాళి అర్పించారు. సీడీఎస్ రావత్ మృతి కేసులో కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ చాలా ఫెయిర్గా జరుగుతోందన్నారు. అయితే ఇప్పుడు ఆ దర్యాప్తుకు చెందిన అంశాలను వెల్లడించలేనన్నారు. ప్రతి చిన్న కోణాన్ని కూడా పరిశీలించాల్సి వస్తోందన్నారు. హెలికాప్టర్ ప్రమాదం జరగడానికి దారి తీసిన అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు ఎయిర్ చీఫ్ వీఆర్ చౌదరీ తెలిపారు. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో పాల్గొన్న ఎయిర్ చీఫ్ మార్షల్ గౌరవ వందనం స్వీకరించారు. సంపన్నమైన వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు మీలాంటి చురుకైన క్యాడెట్లు అవసరమని ఆయన అన్నారు. మీరు ప్రదర్శిస్తున్న అత్యున్నత ప్రమాణాలు.. భవిష్యత్తులో ప్రభావంతమైన ఆపరేషన్లు చేపట్టేందుకు మూలంగా నిలుస్తుందన్నారు.