మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే బావ మరిది శ్రీధర్ మాధవ్ పటాన్కర్ ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. మనీలాండరింగ్ కేసులో ఆయనకు సంబంధించిన 6.45 కోట్లను సీజ్ చేసినట్లు ఈడీ అధికారులను మంగళవారం ప్రకటించారు. ఇందులో 11 ఫ్లాట్లు కూడా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇవి థానే దగ్గర నీలాంబరీ ప్రాజెక్టులోనివని ఈడీ తన ప్రకటనలో పేర్కొంది.
కొన్ని రోజుల కిందటే మంత్రి ఆదిత్య థాకరేకు సంబంధించిన సన్నిహితుడు అనిల్ పరాబ్ నివాసాలపై ఈడీ సోదాలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక… థాకరే బావమరిది పటాన్కర్ ఆస్తులను ఈడీ జప్తు చేయడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. ఇదంతా రాజకీయ కక్షలో భాగమేనని మండిపడ్డారు. ఐదేళ్ల క్రితం ఈడీ అంటే ఏమిటో ఎవ్వరికీ తెలియదని, కానీ ఇప్పుడు అంతా రాజకీయమే చేస్తున్నారని పవార్ మండిపడ్డారు.