న్యూఢిల్లీ: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ వర్షాలను తెస్తాయని ప్రైవేట్ వాతావరణ సంస్థ ‘స్కైమెట్’ అంచనావేసింది. జూన్-సెప్టెంబర్ మధ్య దేశంలో 75 శాతం వర్షపాతానికి నైరుతి రుతుపవనాలే ఆధారం. ఈ ఏడాది వర్షాకాలంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 5 శాతం అటు ఇటుగా 103 శాతం నమోదయ్యే అవకాశం ఉందని స్కైమెట్ పేర్కొంది. ఈశాన్యంలోని కొన్ని భాగాలు, ఉత్తర భారత మైదాన ప్రాంతాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనవచ్చని తెలిపింది.