EMU Train Derail | దేశంలో ఇటీవల రైలు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. రైళ్లు పట్టాలు తప్పడంతో పాటు అగ్ని ప్రమాదాలు కలవరపరుస్తున్నాయి. తాజాగా న్యూఢిల్లీలోని భైరాన్ మార్గ్ సమీపంలో లోకల్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ (ఈఎంయూ) రైలు పట్టాలు తప్పింది. ప్రమాదంలో ప్రయాణాలు సురక్షితంగా ఉండడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని, అందరూ క్షేమంగా ఉన్నారని రైల్వే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) పేర్కొన్నారు. ఆ తర్వాత సమాచారం అందుకున్న సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఢిల్లీలోని జీ20 సమ్మిట్ 2023 వేదికగా ఉన్న న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ సమీపంలో హర్యానాలోని పల్వాల్ నుంచి ఢిల్లీ స్టేషన్కు వెళ్తున్న లోకల్ రైలు పట్టాలు పట్టాలు తప్పింది. ఘటనల్ఓ రైలు బోగి ధ్వంసం కాగా.. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.