Kangana Ranaut | కంగనా రనౌత్ కీ రోల్లో నటిస్తున్న ఎమర్జెన్సీ సినిమా మరోసారి వాయిదా పడింది. ప్రస్తుతం కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ లోని మండి పార్లమెంట్ ఎంపీగా కూడా ఉన్నారు. ఈ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రలో ఆమెనే నటించారు. సినిమాలో సెన్సిటివ్ కంటెంట్ ఉందని CBFC తెలిపింది. ఎమర్జెన్సీ సినిమా రిలీజ్ నిలిపివేయడానికి కారణాలు తెలియజేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) వివరించింది. సినిమాలు మతపరమైన మనోభావాలను దెబ్బతీయకూడదని బోర్డు సూచించింది. సెప్టెంబర్ 6న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1972లో విధించిన ఎమర్జెన్సీ కాలంనాటి రాజకీయ పరిణామాల గురించి ఈ సినిమాలో వివరించారు. సిక్కుల మతస్థుల మనోభావాలు దెబ్బతీలా ఈ సినిమా తీశారని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ ఆరోపిస్తోంది.
ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ (DSGMC) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) మరియు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు సినిమా విడుదలను ఆపాలని లేఖలు పంపింది. సినిమా ప్రదర్శనపై నిషేధం విధించాలని కోరింది. సినిమాలో కొన్ని సున్నితమైన అంశాలు ఉన్నాయని కొన్ని మత సంస్థలు ఆందోళనలు కూడా చేశాయి. ఆగస్టు 14న ఎమర్జెన్సీ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఈ సినిమాపై విమర్శలు, వివాదాలు వస్తున్నాయి. ట్రైలర్లో పంజాబ్ వేర్పాటువాద ఖలిస్తాన్ ఉద్యమ నాయకుడు జర్నైల్ సింగ్ భింద్రన్వాలే పాత్రను తప్పుగా చిత్రీకరించారని ఆరోపణలు ఉన్నాయి.
అకాల్ తఖ్త్ సాహిబ్పై బాంబు దాడి, ఆపరేషన్ బ్లూ స్టార్, ఎమర్జెన్సీ టైంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలను విస్మరిస్తూ.. కథను పూర్తిగా ఒకవైపు మాత్రమే చూపించారని కొన్ని వర్గాలు ఎమర్జెన్సీ సినిమాని వ్యతిరేకిస్తున్నాయి.