Arunachal pradesh : అరుణాచల్ ప్రదేశ్కు చెందిన మిరామ్ తారోమ్ అనే యువకుడ్ని చైనా ఆర్మీ కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చైనా ఈ యువకుడ్ని భారత్కు అప్పగించింది. అయితే చైనా ఆర్మీ చేతిలో బందీగా ఉన్న సమయంలో ఆ యువకుడికి చైనా ఎలక్ర్టికల్ షాక్ ఇచ్చిందా? ఈ ఘటనతో ఆ బాలుడు మానసికంగా కుంగిపోయాడా? ఈ విషయంపై బాలుడి తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడ్ని చైనా సైన్యం బందీ చేసిందని, కళ్లకు గంతలు కట్టి, చేతులు కూడా కట్టేశారని మిరామ్ తారోమ్ తండ్రి ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని రోజులు తన బాలుడికి చైనా సైన్యం ఎలక్ట్రిక్ షాక్ కూడా ఇచ్చిందని, ఈ ఘటనతో తన కుమారుడు ఘోరంగా కుంగిపోయాడని తన తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిరామ్ తారోమ్ ఇప్పుడు మా దగ్గరే ఉన్నాడు. అయినా ఇంకా షాక్లోనే ఉన్నాడు. మొదట్లో చైనా తనకు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చింది. ఎక్కువ సమయం కళ్లకు గంతలు కట్టేసే వుంచేవారు. చేతులు కూడా కట్టేసేవారు. కేవలం ఆహారం స్వీకరించే సమయంలో మాత్రమే చేతులకు వున్న కట్లు, కళ్లకు వున్న కట్లను విప్పేవారు. అని మిరామ్ తారోమ్ తండ్రి పేర్కొన్నాడు.