బెంగళూరు, ఆగస్టు 24: కర్ణాటకలోని మండ్య నగరంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగించిన ఓ వృద్ధురాలి జీవితం, ఆమె మరణం స్థానికుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. వయోభారంతోపాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న హూర్(69) ఇటీవల మృతి చెందింది.
తర్వాత బంధువులు, స్థానికులు ఆమె ఇంటికి వెళ్లారు. ఇంటి లోపల 30కిపైగా సంచుల్లో నోట్ల కట్టలు, భారీగా నాణేలు కనిపించాయి. వాటిని లెక్కించగా రూ.8.40 లక్షలు నగదు ఉన్నట్టు గుర్తించారు. ఆమె సోదరుల్లో ఒకరు రూ.6లక్షలు తీసుకోగా, మిగిలిన డబ్బును మసీదుకు విరాళంగా ఇచ్చినట్టు తెలిసింది. కుటుంబసభ్యులు ఆమెను సరిగా పట్టించుకోకపోవడంతోనే ఆమె భిక్షాటన చేస్తూ జీవించాల్సి వచ్చిందని తెలిసింది.