Viral Video | లక్నో : ఓ ఎద్దు బీభత్సం సృష్టించింది. వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధుడిపై ఎద్దు దాడి చేసింది. విచక్షణారహితంగా కొమ్ములతో పొడిచి చంపింది ఎద్దు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బరేలీలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బరేలీలోని సంజయ్ నగర్ ఏరియాలో ఓ వృద్ధుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే దారిలో ఓ రెండు పశువులు నడుచుకుంటూ వెళ్లాయి. అవి ఆ వృద్ధుడికి ఎలాంటి హానీ కలిగించలేదు. ఆ తర్వాత వచ్చిన మరో ఎద్దు వృద్ధుడిపై దాడి చేసింది. కడుపులో కొమ్ములతో పొడిచి, నేలపై పడేసింది. అపస్మారకస్థితిలోకి వెళ్లిన వృద్ధుడిని పదేపదే ఎద్దు పొడిచింది. దీంతో ఆ వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అయితే ఈ ఘటన బుధవారం ఉదయం 8 గంటలకు చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి బయల్దేరిన కాసేటికే వృద్ధుడిపై ఈ దాడి జరిగింది. మృతుడిని కృష్ణానంద్ పాండే(75)గా పోలీసులు గుర్తించారు. షుగర్ మిల్ మేనేజర్గా పని చేసి పదవీ విరమణ పొందారు.
#उत्तर_प्रदेश #बरेली के संजय नगर में सुबह मॉर्निंग वॉक पर निकले रिटायर्ड बैंक कर्मचारी को सांड ने जान से मार डाला !!#Bareilly #Bull @bareilly_nn @dmbareilly #viralvideo pic.twitter.com/Dyk5P1MeZg
— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) January 24, 2024