న్యూఢిల్లీ, ఆగస్టు 2: దేశంలో మంకీపాక్స్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం ఢిల్లీలోకి ఆఫ్రికాకు చెందిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయింది. దీంతో దేశంలో మొత్తం మంకీపాక్స్ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది. మంకీపాక్స్ వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీ సర్కారు అప్రమత్తమైంది. ఆరు దవాఖానల్లో 70 ఐసొలేషన్ గదులను ఏర్పాటుచేసినట్టు అధికారులు తెలిపారు. మంకీపాక్స్కు వ్యాక్సిన్ అభివృద్ధి చేసేందుకు పరిశోధనలు సాగిస్తున్నట్టు సీరం సంస్థ సీఈవో అదర్ పూనావాలా తెలిపారు.
అమెరికాలో మూడు రాష్ర్టాల్లో ఎమర్జెన్సీ
మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికాలోని న్యూయార్క్, కాలిఫోర్నియా, ఇల్లినాయిస్లో అత్యవసర పరిస్థితి విధించారు. అమెరికాలో 6వేలకుపైగా మంకీపాక్స్ కేసులు వెలుగుచూడగా, అందులో సగానికిపైగా ఈ మూడు రాష్ర్టాల్లోనే నమోదయ్యాయి.