ముంబై, ఫిబ్రవరి 13: సెట్ టాప్ బాక్సులు అవసరం లేకుండా 200 చానళ్లు చూసేలా టీవీల్లోనే బిల్ట్ ఇన్ శాటిలైట్ ట్యూనర్లు ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.
టీవీల్లోనే శాటిలైట్ ట్యూనర్లు ఉంటే.. ఇంటి పైకప్పుపై చిన్న యాంటిన్నా ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని ఆయన తెలిపారు. కాగా, ప్రస్తుతం పెయిడ్ చానళ్లతో పాటు దూరదర్శన్ ప్రసారం చేసే ఉచిత చానళ్లు చూడటానికి కూడా సెట్ బాక్సులు తప్పనిసరి.