చండీఘడ్: హర్యానా మాజీ ఎమ్మెల్యే దిల్బాగ్ సింగ్(Ex-MLA Arrested)తో పాటు అతని సన్నిహితుడు కుల్విందర్ సింగ్ను ఈడీ అరెస్టు చేసింది. అక్రమ మైనింగ్తో లింకున్న మనీ ల్యాండరింగ్ కేసులో ఆ ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. ఇండియన్ నేషనల్ లోక్దళ్ పార్టీలో దిల్బాగ్ సింగ్ గతంలో యమునా నగర్ అసెంబ్లీ సీటు నుంచి ప్రాతినిధ్యం వహించారు. గత అయిదు రోజుల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సంబంధించిన పరిసరాలపై ఈడీ సోదాలు చేసింది. అయితే పీఎంఎల్ఏ చట్టం కింద దిల్బాగ్, కుల్విందర్ సింగ్లను అరెస్టు చేశారు. ఆ ఇద్దర్నీ స్థానిక కోర్టు ముందు హాజరుపరిచారు.
ఆ ఇద్దరి నుంచి అయిదు అక్రమ రైఫిళ్లు, 300 బుల్లెట్లు, కాట్రిడ్జ్లు, 100 మద్యం సీసాలు, 5 కోట్ల నగదును ఈడీ సీజ్ చేసింది. గతంలో యమునా నగర్లో జరిగిన అక్రమ మైనింగ్ కేసులో హర్యానా పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది. లీజు ముగిసిన తర్వాత, ఎన్జీటీ బ్యాన్ ఉన్నా.. అక్రమంగా మైనింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ-రావణ స్కీమ్లో జరిగిన అవకతవకల గురించి కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపడుతోంది. ఈ-రావణ ఆన్లైన్ పోర్టల్ ద్వారా హర్యానా ప్రభుత్వం మైనింగ్ పన్ను చెల్లింపులను సులభతరం చేసింది. అయితే ఆ విధానంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.