న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren) అధికార నివాసానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు చేరుకున్నారు. మనీ లాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న సోరెన్కు ఈ నెల 27న ఈడీ తొమ్మిదోసారి నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. మరోసారి ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేయాల్సి ఉందని.. జనవరి 29 లేదా 31 తేదీల్లో అందుబాటులో ఉండాలని అందులో పేర్కొన్నది. ఈ రెండు రోజుల్లో ఒకదానిని ఎంచుకోవాలని సూచించింది. అయితే ఈడీ నోటీసులకు సోరెన్ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఆయన అధికార నివాసానికి అధికారులు చేరుకున్నారు.
మనీలాండరింగ్ కేసులో సీఎం సోరెన్ను రాచీలోని అధికార నివాసంలో ఈడీ అధికారులు ఈ నెల 20న సుదీర్ఘంగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. జార్ఖండ్లో భూమి యాజమాన్యాన్ని అక్రమంగా మార్చే భారీ మాఫియాకు సంబంధించిన స్కామ్పై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 14 మందిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్గా, రాంచీ డిప్యూటీ కమిషనర్గా పనిచేసిన రంజన్ను కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు.
Hemant Soren