తిరువనంతపురం, ఏప్రిల్ 5: మలయాళ సినిమా ‘ఎంపురాన్’ నిర్మాత గోకులం గోపాలన్ కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా దాడులు చేపట్టింది. చెన్నై, కొచ్చి, కర్ణాటకలలో ఆయనకు సంబంధించిన ఐదు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు జరిపి కీలక పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ వర్గాలు తెలిపాయి.
చెన్నైలో జరిపిన సోదాల్లో రూ.1.5 కోట్ల నగదును ఈడీ సీజ్ చేసినట్టు తెలిసింది. అక్రమ నగదు లావాదేవీలతో వచ్చిన నిధులను ఉపయోగించి ‘ఎంపురాన్’ సినిమా తీశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ‘శ్రీ గోపాలన్ చిట్, ఫైనాన్స్’ కంపెనీపై ఈడీ తాజాగా ఫెమా దాడులు నిర్వహించింది. 2017లో గోపాలన్కు చెందిన చిట్ ఫండ్ కంపెనీపై ఐటీ దాడులు జరిగాయి. 78 శాఖల్లో రూ.1,107 కోట్ల విదేశీ పెట్టుబడులు ఉన్నట్టు గుర్తించారు.