రాంచీ, జనవరి 3: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ప్రెస్ అడ్వైజర్, మాజీ ఎంఎల్ఏ, కొందరు జిల్లా అధికారుల ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. అక్రమ మైనింగ్ కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలతో సీఎం సలహాదారు అభిషేక్ ప్రసాద్ అలియాస్ పింటూ, సాహిబ్ గంజ్ జిల్లా కలెక్టర్, మాజీ ఎంఎల్ఏ పప్పు యాదవ్ మరికొందరు ఇళ్లపై రాజధాని రాంచీ, రాజస్థాన్లో ఈడీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. సొరేన్ ప్రభుత్వాన్ని గద్దె దించే కుట్రలో భాగంగా ఈడీ ద్వారా బీజేపీ ఈ దాడులు చేయిస్తున్నదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సుబోధ్ కాంత్ యాదవ్ సహాయ్ ఆరోపించారు.