Sanjay Singh | ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఆప్ నేత, ఎంపీ సంజయ్ సింగ్ సన్నిహితుల ఇండ్లపై బుధవారం దాడులు నిర్వహించింది. మద్యం దుకాణాలు, వ్యాపారులకు లైసెన్సులు ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఎంపీతో పాటు అతని సన్నిహితులు భాగస్వాములయ్యారని, దాంతో ఖజానాకు నష్టం వాటిల్లినట్లుగా ఆరోపణలున్నాయి. సర్వేష్ మిశ్రా, అజిత్ త్యాగి నివాసాలతో సహా ఆరు చోట్ల ఈడీ దాడులు నిర్వహించింది. మరో వైపు ఈడీ దాడుల నేపథ్యంలో సంజయ్ సింగ్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా మోదీ ఈడీ నియంతృత్వాన్ని, గుండాయిజాన్ని దేశం ముందు బయటపెట్టానని, ఈఈ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. మద్యం కుంభకోణంలో వ్యక్తుల ప్రమేయాన్ని మోసపూరితంగా రుజువు చేస్తోందని, తనకు వ్యతిరేకంగా ఏ ఆధారాలు సాధించలేకపోవడంతో తన సహాయకులపై దాడులు నిర్వహిస్తన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అజిత్ త్యాగి, సర్వేష్ మిశ్రా ఇళ్లపై దాడులు జరిగినట్లు తెలిసిందని, ప్రధాని మోదీ ప్రభుత్వం జిమ్మిక్కులు, ఈడీ పన్నిన ఎలాంటి కుట్రకు వ్యతిరేకంగా రాజీపడబోనని, వ్యతిరేకంగా పోరాడుతామన్నారు.
దేశం ముందు అన్నింటిని బహిర్గతం చేస్తామని, ఈడీ ఎలా దుర్వినియోగమవుతుందో బయటపెడుతానన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జోక్యం చేసుకున్నా తమ పోరాటం కొనసాగుతుందని సంజయ్ సింగ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. లిక్కర్ పాలసీ వ్యవహారంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఈడీ డైరెక్టర్, మద్యం పాలసీ కేసుకు సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్, దర్యాప్తు అధికారిని ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి కోరుతూ సంజయ్ సింగ్ ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి లేఖ రాశారు. ఈ క్రమంలో దాడులు జరుగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
#WATCH | Aam Aadmi Party MP Sanjay Singh alleges ED raids are being conducted at the premises of his colleagues Ajit Tyagi and Sarvesh Mishra. pic.twitter.com/P2BICTr45D
— ANI (@ANI) May 24, 2023