న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ బ్యాంకు కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను గురువారం ఎన్ఫోర్స్మెంట్స్ డైరెక్టరేట్ గురువారం ప్రశ్నిస్తున్నది. అధికార వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని ఏజెన్సీ కార్యాలయంలో నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ను విచారిస్తున్నట్లు చెప్పాయి. గతంలో అబ్దుల్లాకు ఈడీ న్యూఢిల్లీలోని కార్యాలయానికి రావాలని సమన్లు పంపింది. బ్యాంకు ఖాతాలు తెరిచిన పలువురు సీనియర్ రాజకీయ నేతల పాత్రపై ఈడీ విచారణ జరుపుతున్నది. బ్యాంకులో అక్రమ లావాదేవీలు జరిగినట్లు తేలింది. అక్రమ లావాదేవీలు, సరిపోలని డాక్యుమెంట్లతో ఖాతాల్లో కొన్ని నుంచి అనధికార ఖాతాలకు డబ్బులు బదిలీ అయినట్లు తేలింది.
నిధుల దుర్వినియోగంపై ఈడీ మనీలాండింగ్ కింద కేసు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నది. జేఅండ్కే బ్యాంక్ స్కామ్ డిఫాల్ట్ చేసిన సంస్థలకు పూచీకత్తు లేకుండా భారీ రుణాలు ఇవ్వడం, ఇద్దరు మాజీ చైర్పర్సన్లు ఇప్పటికే రాజకీయ నేతలతో కుమ్మక్కై బ్యాంకులో కీలక స్థానాల్లో వ్యక్తులను రుణాల మంజూరు కోసం నియమించారని ఆరోపణలు వచ్చాయి. అయితే, ఒమర్ అబ్దుల్లాకు నోటీసులు జారీ చేయడంపై ఇప్పటికే నేషనల్ కాన్ఫరెన్స్ ఆరోపణలు గుప్పించింది. ఒమర్ అబ్దుల్లా ఎలాంటి తప్పు చేయలేదని, విచారణకు సహకరిస్తారని స్పష్టం చేసింది. అయితే, విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.