పాట్నా, జనవరి 19: ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలా ప్రసాద్ యాదవ్, అతని కుమారుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఇంతకుముందు సమన్లు జారీచేసినా వీరు విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 29న లాలూ ప్రసాద్, 30న తేజస్వి యాదవ్ పాట్నాలోని తమ కార్యాలయం ముందు విచారణకు హాజరు కావాలని ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. లాలూ ప్రసాద్ యాద వ్ రైల్వే మంత్రిగా ఉండగా ఈ కుంభకోణం జరిగినట్టు ఈడీ ఆరోపించింది.