కోల్కతా : 2016 నారదా స్టింగ్ ఆపరేషన్ కేసు చార్జిషీట్ను ఈడీ బుధవారం ప్రత్యేక న్యాయస్ధానంలో దాఖలు చేసింది. బెంగాల్ మంత్రులు పిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే మదన్ మిత్రా, ఆ పార్టీ మాజీ నేత సోవన్ ఛటర్జీలను నిందితులుగా చార్జిషీట్లో ఈడీ పేర్కొంది. నవంబర్ 16న వారిని హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు టీఎంసీ నేతలతో పాటు కోల్కతా మాజీ మేయర్ సొవన్ ఛటర్జీని సీబీఐ ఈ ఏడాది మేలో అరెస్ట్ చేసింది.
హకీం, ముఖర్జీ, మిత్రా, ఛటర్జీల ప్రాసిక్యూషన్కు సీబీఐకి బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధంకర్ అనుమతించిన నేపథ్యంలో వారిని అరెస్ట్ చేశారు. 2016లో ఈ స్కామ్ వెలుగుచూసిన సమయంలో ఈ నలుగురు నేతలు మమతా బెనర్జీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హకీం, ముఖర్జీ, మిత్రా తిరిగి ఎన్నికవగా, టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఛటర్జీ ప్రస్తుతం రెండు పార్టీలకు దూరంగా ఉన్నారు.