ముంబై : శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్నేహితుడు, అత్యంత సన్నిహితుడిగా భావిస్తున్న ప్రవీణ్ రౌత్పై ఈడీ శుక్రవారం మనీల్యాండరింగ్ కేసులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్లో హెచ్డీఐఎల్కు చెందిన సారంగ్ వాధ్వాన్, రాకేష్ వాధ్వాన్, రియల్ ఎస్టేట్ కంపెనీ గురు ఆశిష్ కన్స్ట్రక్షన్స్ సహా ఇతరులను నిందితులుగా పేర్కొంది.
రూ 1034 కోట్ల పత్రా చాల్ ల్యాండ్ స్కామ్ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ పలు విషయాలను గుర్తించింది. నేరపూరిత లావాదేవీల్లో ఆర్జించిన మొత్తంలో ప్రవీణ్ రౌత్ రూ 55 లక్షలను తన భార్య ఖాతా ద్వారా శివసేన నేత సంజయ్ రౌత్ భార్య వర్ష కాతాకు బదలాయించినట్టు ఈడీ గుర్తించింది.
ఈ డబ్బు ద్వారానే ప్రవీణ్ రౌత్ అలీబాగ్ వద్ద భూమి కొన్నాడని, 2010-12 మధ్య నగదు రూపంలో చెల్లింపులు జరిపాడని దర్యాప్తు సంస్ధ అనుమానిస్తోంది. ప్రవీణ్ రౌత్ భార్య సంజయ్ రౌత్ భార్యకు రూ 55 లక్షలు అప్పుగా ఇచ్చిందని రిమాండ్ రిపోర్ట్లో ఈడీ ప్రస్తావించింది. దేశీ, అంతర్జాతీయ ప్రయాణాలకు గాను సంజయ్ రౌత్ ఆయన అనుచరులకు ప్రవీణ్ రౌత్ టికెట్లు, వసతి సౌకర్యాలకు సొమ్ము వెచ్చించాడని ఈడీ అనుమానిస్తోంది.