శ్రీనగర్ : క్రికెట్ స్కాం కేసులో మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం నిబంధనల కింద జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్ధుల్లాపై శ్రీనగర్ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ నమోదు చేసింది. మనీ ల్యాండరింగ్ కేసులో నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్ధుల్లా, అహ్మద్ మిర్జా, ఇతరులను కోర్టు ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
జమ్ము అండ్ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (జేకేసీఏ)కు 2001-2012లో ఫరూక్ అబ్ధుల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చోటుచేసుకున్న ఆర్ధిక అవకతవకలపై ఈడీ దర్యాప్తు సాగిస్తోంది. పీఎంఎల్ఏ నిబంధనల కింద ఈడీ ఇప్పటికే శ్రీనగర్ ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో అనుబంధ ప్రాసిక్యూషన్ కంప్లయింట్ను దాఖలు చేసింది. ఈడీ ఫిర్యాదు ఆధారంగా ఫరూక్ అబ్ధుల్లా సహా నిందితులు ఆగస్ట్ 27న తమ ఎదుట హాజరు కావాలని స్పెషల్ పీఎంఎల్ఏ కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఫరూక్ అబ్ధుల్లా సహా నిందితులకు సంబంధించిన రూ 21.55 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన అనంతరం ఈడీ అనుబంధ ఫిర్యాదును దాఖలు చేసింది. జేకేసీఏ నిధులను నిందితులు పలు వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు మళ్లించారని కేసులో ప్రధాన అభియోగాలుగా ఈడీ ఆరోపిస్తోంది.