న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక సలహా మండలి చైర్మెన్ బిబేక్ డెబ్రోయ్(Bibek Debroy) ఇవాళ కన్నుమూశారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన బిబేక్ డెబ్రోయ్.. గతంలో పుణెలోని గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ కు ఛాన్సలర్గా చేశారు. ఉదర సంబంధిత వ్యాధి వల్ల ఇవాళ ఉదయం ఏడు గంటలకు బిబేక్ డెబ్రోయ్ మృతిచెందినట్లు ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు ప్రకటన జారీ చేశారు. బిబేక్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఆయనో గొప్ప పండితుడు అని పేర్కొన్నారు. ఆర్థికశాస్త్రం, చరిత్ర, సంస్కృతి, రాజకీయం, ఆధ్యాత్మికత లాంటి భిన్నమైన రంగాల్లో నిష్ణాతుడు అని తెలిపారు. ప్రజల శ్రేయస్సు కోసం ఆయన పనిచేశారని, ప్రాచీన సాహిత్యంపై వర్క్ చేశారని, దాన్ని నేటితరం యువతకు అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. బిబేక్ డెబ్రోయ్ అత్యద్భుతమైన విద్యావేత్త అని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తెలిపారు.
Dr. Bibek Debroy Ji was a towering scholar, well-versed in diverse domains like economics, history, culture, politics, spirituality and more. Through his works, he left an indelible mark on India’s intellectual landscape. Beyond his contributions to public policy, he enjoyed… pic.twitter.com/E3DETgajLr
— Narendra Modi (@narendramodi) November 1, 2024