న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఒక జంట వివాహం పూర్తి పర్యావరణ హితంగాను, ఎలాంటి ఆడంబరం లేకుండా జరిగింది. వ్యర్థాల రీసైలింగ్ పరిశ్రమను ఏర్పాటు చేసిన వధువు మాధురి బలోడి ఆలోచన మేరకు వారి పెండ్లి చాలా సింపుల్గా సాగింది. 32 ఏండ్ల వరుడు ఆదిత్య అగర్వాల్ కొందరు మగ కుటుంబ సభ్యులతో కలిసి తేలికపాటి యులు ఎలక్ట్రిక్ బైక్పై ఊరేగింపుగా పెండ్లి వేదికైన వధువు బంధువుకు చెందిన గార్డెన్కు చేరుకున్నారు. అక్కడ పాత సీసాలు, పేపర్లను అందంగా అలంకరించారు. వధువు కుటుంబ సభ్యులు, స్నేహితులే స్వయంగా ఈ ఏర్పాట్లు చేశారు.
ఇక పెండ్లిలో వధువరులు బంగారు ఆభరణాలకు దూరంగా ఉన్నారు. మూడు వేలలోపు దుస్తులనే ధరించారు. దండలుగా తులసి మాలలు మార్చుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులు కేవలం ఒక కిలో పండ్లు మాత్రమే పెండ్లికి తెచ్చారు. ఎలాంటి కట్నకానుకలు ఇచ్చిపుచ్చుకోలేదు. వధువు కుటుంబానికి చెందిన వ్యక్తి పురోహితునిగా, ఒక స్నేహితుడు ఫోటోగ్రాఫర్గా వ్యవహరించారు.
ఈ వెడ్డింగ్ కార్డు ద్వారా బంధువులు, స్నేహితులను ఆహ్వానించారు. వివాహానికి వచ్చిన వారికి మొక్కలను బహుమతిగా ఇచ్చారు. మొత్తం పెండ్లి ఖర్చు రెండు లక్షలకు మించలేదు. ఇలా ఈ జంట వివాహం పూర్తి పర్యావరణ హితంగాను, చాలా నిరాడంబరంగాను జరిగింది. 14 ఏండ్లుగా డేటింగ్లో ఉన్న మాధురి, ఆదిత్య ఈ ఏడాది జనవరి 14న పెండ్లితో ఒక్కటయ్యారు. కాగా, ఈ జంట వినూత్న వివాహం, పెండ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.