న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విడుదల చేసిన పాటపై ఈసీ నిషేధం విధించిందని ఆ పార్టీ నేత, ఢిల్లీ రాష్ట్ర మంత్రి ఆతిశీ తెలిపారు. ‘జైలులో పెట్టినందుకు సమాధానంగా మేము ఓటు వేస్తాం’ అనే అర్థం వచ్చే హిందీ పాటను ఈసీ నిషేధించిందని చెప్పారు. బీజేపీ, కేంద్ర దర్యాప్తు సంస్థలను ఈ పాటలో చెడుగా చూపించారని ఈసీ చెప్పిందన్నారు. ఓ పార్టీ ప్రచార పాటపై ఈసీ నిషేధం విధించడం బహుశా ఇదే తొలిసారి కావచ్చునన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఇది ఉల్లంఘించలేదని తెలిపారు.