Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో (Andaman and Nicobar Islands) మరోసారి భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం తెల్లవారుజామున 4.17 గంటలకు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 4.3గా నమోదయిందని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 61 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు సంభవించాయని వెల్లడించింది. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
కాగా, గత 24 గంటల్లో అండమాన్ దీవుల్లో భూమి కంపించడం ఇది రెండోసారి. బుధవారం ఉదయం 5.40 గంటలకు 5.0 తీవ్రతతో భూమి కంపించిందని ఎన్సీఎస్ వెల్లడించింది. అంతకుముందు జూలై 29న అర్ధరాత్రి 12.53 గంటల సమయంలో పోర్టు బ్లెయిర్ (Port Blair) సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత 5.8గా నమోదయింది. భూఅంతర్భాగంలో 69 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. భూకంప కేంద్రం (Epicentre) పోర్టు బ్లెయిర్కు 126 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొంది.
Earthquake of Magnitude:4.3, Occurred on 03-08-2023, 04:17:58 IST, Lat: 10.69 & Long: 92.05, Depth: 61 Km ,Region: Andaman Islands, India for more information Download the BhooKamp App https://t.co/8M0y9ZgqUA@KirenRijiju @Indiametdept @Dr_Mishra1966 @ndmaindia @Ravi_MoES pic.twitter.com/cWUpfEeOIc
— National Center for Seismology (@NCS_Earthquake) August 3, 2023