పట్నా: దేశంలో గత కొంతకాలంగా ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. బుధవారం తెల్లవారుజామున బీహార్ (Bihar), పశ్చిమ బెంగాల్లో (West Bengal) భూమి స్వల్పంగా కంపించింది (Earthquake). ఇవాళ ఉదయం 5.35 గంటలకు బీహార్లోని అరారియాలో (Araria) ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. దీనితీవ్రత 4.3గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. పూర్నియాకు (Purnia) సమీపంలో భూకంప కేంద్రం ఉన్నదని చెప్పింది. భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయని తెలిపింది. కాగా, భూకంపం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించింన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.
ఇక పశ్చిమ బెంగాల్లో కూడా బుధవారం తెల్లవారుజామున భూమి కంపించిందని ఎన్సీఎస్ తెలిపింది. ఉదయం 5.35 గంటలకు సిలిగురిలో (Siliguri) భూకంపం వచ్చిందని వెల్లడించింది. సిలిగురికి 140 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని చెప్పింది.
An earthquake of magnitude 4.3 occurred in Araria, Bihar at around 5.35 am. The depth of the earthquake is 10 Km: National Center for Seismology pic.twitter.com/EyQUP4Wh9X
— ANI (@ANI) April 12, 2023