చండీగఢ్: హర్యానాలోని ఝజ్జర్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 3.3 తీవ్రత నమోదైంది. శుక్రవారం రాత్రి 8.15 గంటలకు ఝజ్జర్లో స్వల్ప భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. మరోవైపు భూమి కంపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తమ ఇండ్లను వీడి బయటకు వచ్చారు. భూ ప్రకంపనల భయంతో చాలా సేపు ఇళ్ల బయటే ఉన్నారు.