న్యూఢిల్లీ: దీపావళి నేపథ్యంలో దేశంలోని పలు ఆధ్యాత్మిక ప్రదేశాలు దీప కాంతులతో వెలిగిపోతున్నాయి. గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్లోని అక్షరధామ్ ఆలయాన్ని 10,000 మట్టి దీపాలతో అందంగా అలంకరించారు. ఈ దీప కాంతులతో అక్షరధామ్ వెలిగిపోయింది.
మరోవైపు దీపావళి సందర్భంగా ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని సరయూ నది ఒడ్డున దీపోత్సవం నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా లక్షల సంఖ్యలో మట్టి దీపాలు వెలిగించారు. దీంతో అయోధ్యలోని సరయూ నది తీరం దీప కాంతులతో మెరిసిపోయింది.