న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: రాష్ట్ర స్థాయిలో మైనార్టీల గుర్తింపునకు చర్యలు తీసుకునేలా చూడాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరుపనున్నది. న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్తోపాటు పలువురు ఈ పిటిషన్లను దాఖలు చేశారు. రాష్ట్రస్థాయిలో మైనార్టీలను గుర్తించాలని కోరడంతోపాటు నేషనల్ మైనార్టీ కమిషన్ యాక్ట్-1992 రాజ్యాంగబద్ధతను, నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ యాక్ట్-2004ను పిటిషన్దారులు ప్రశ్నించారు.